హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. పీఆర్సీని ఆమోదిస్తూ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. జూన్ నెల నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోపాటు ప్రభుత్వోద్యోగులకు పెరిగిన పీఆర్సీకి అనుగుణంగా వేతనాలు విడుదల చేయాలని నిర్ణయించింది.
క్యాబినెట్ నిర్ణయం వల్ల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు కలిపి 9,21,037 మంది ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వోద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. 2018 జూలై ఒకటో తేదీ నుంచి నోషనల్ బెనిఫిట్, గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మానిటరీ బెనిఫిట్, ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్యాష్ బెనిఫిట్ అమలు చేయయాలని నిర్ణయం తీసుకున్నది
ఈ విషయమై ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మే 31 వరకు పెన్షనర్లకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిల)ను 36 వాయిదాల్లో చెల్లించాలని కూడా నిర్ణయించారు.
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్ఫిట్లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్పై కేసు