న్యూఢిల్లీ: తన ప్రభుత్వాన్ని తొలగించిన రెండేండ్లకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో మీడియా ముందుకు రానున్నారు. దక్షిణాసియా విదేశీ కరస్పాండెంట్ల క్లబ్ ఈ నెల 5న న్యూఢిల్లీలో నిర్వహించే వర్చువల్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. తన భవిష్యత్తు, బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లడం గురించి ఆమె ఇందులో మాట్లాడుతారని భావిస్తున్నారు. హసీనా 15 ఏండ్ల పాలన పతనమై రెండేండ్లు పూర్తయిన రోజునే ఈ కార్యక్రమం జరుగుతున్నది. సమావేశానికి హాజరు కావాలని బంగ్లాదేశ్కు చెందిన రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, ప్రజా ప్రముఖులకు ఆహ్వానాన్ని పంపారు.