చిక్కడపల్లి, ఆగస్టు 2: అసలే ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజులు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని నిరుద్యోగ జేఏసీ నేత శంకర్నాయక్ మండిపడ్డారు. అప్లికేషన్ ఫీజులు పెంచడంపై ఆదివారం సిటీసెంటర్ లైబ్రరీలో సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నిస్తూ.. ఇది ప్రజా పాలనా..? లేక దోపిడీ పాలనా..? అని వెలిసిన పోస్టర్ చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా శంకర్నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక్క రూపాయి అప్లికేషన్కు తీసుకోమని హామీ ఇచ్చి.. ఇప్పుడు విపరీతంగా పెంచడం ఏందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిరుద్యోగులను నిండా ముంచుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 90శాతం అధికంగా వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుశాఖలో దాదాపు 20 వేల పోస్టులు ఉండగా, కేవలం 7వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పుడు ఫీజులు పెంచడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఒక్క అభ్యర్థి నాలుగు పోస్టులకు ఐప్లె చేస్తే ఒక్కొ పోస్టుకు రూ. 1500 చొప్పున 6వేల వరకు ఖర్చు అవుతుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అప్లికేషన్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు.