ముంబై: కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు రకరకాల మాస్క్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వెండి, బంగారంతో తయారైన మాస్క్లు కూడా అందుబాటులో రాగా.. ఇప్పడు బ్యాటరీతో పనిచేసే ఫేస్ మాస్క్ సిద్ధమైంది. కరోనా వైరస్ను నివారించడానికి ఐదు పొరలు గల వ్యవస్థ ఈ బ్యాటరీ మాస్క్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మాస్క్ ముక్కు, నోటిలోకి వెళ్లే గాలిని ఐదు సార్లు ఫిల్టర్ చేస్తుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ను నివారించడానికి ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని ఈ మాస్క్ను తయారుచేసిన నవన్ ఎయిర్ సంస్థ తెలిపింది.
శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి అనుమతించే మూడు పాయింట్లు.. నోరు, ముక్కు, కళ్ళను సులభంగా కవర్ చేస్తుంది. దీనితో పాటు 5 పొరల రక్షణ గాలిలో ఉండే కార్బన్ నుంచి కూడా రక్షిస్తుంది. ఇది స్వచ్ఛమైన గాలి శరీరానికి చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఎయిర్ బూస్టర్ సిస్టమ్ అందుబాటులో ఉండటం ద్వారా శ్వాస తీసుకోవడంలో సమస్య ఉండదు. ఎయిర్ బూస్టర్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల వైరస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. అలాగే, మాస్క్ లోపలికి గాలిని తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. భారతదేశంలో తయారుచేసిన నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్ మాస్క్ ఇది. ఎన్95 మాస్క్ వంటి ఫిల్టర్లు ఉండి కార్బన్ను తొలగించడం ద్వారా గాలిలో ఉండే హానికరమైన మూలకాల నుంచి 100 శాతం రక్షణ కల్పించడం ద్వారా ఇది ఫేస్ షీల్డ్గా పనిచేస్తుంది. గాలిలో ఉండే పొగ, రసాయన కాలుష్య కారకాలు, హానికరమైన వాయువులను గ్రహిస్తుందని నవన్ సొల్యూషన్స్ సీఈఓ నీరజ్ సావంత్ వెల్లడించారు.
పాక్లో ఆఫ్ఘన్ రాయబారి కూతురు కిడ్నాప్, హింస
సువేందు మెడకు బాడీగార్డ్ మృతి కేసు
ఆ ఫొటో జర్నలిస్ట్ను మేం చంపలేదు : తాలిబాన్
విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇవ్వాలి : కేరళ గవర్నర్
యూజీసీ అకడమిక్ క్యాలెండర్ విడుదల
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
సోనియా గాంధీకి కెప్టెన్ ఘాటు లేఖ
ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్కు యూఎన్ లేఖ
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..