KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ బీజేపోడు వస్తడు. కాంగ్రెసోడు వస్తడు. బీఆర్ఎస్కు బీజేపీ బీ-టీమ్ అంటడు. వాడువీనికి.. వీనికి వాడు అంటడు. కానీ, మొన్న భోనగిరిలో ఏం జరిగింది ? భోనగిరి మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ను తీసేసి ఇవాళ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతున్నది. ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నరు. ఈ ముఖ్యమంత్రిని హామీలు అమలు చేస్తలేవంటే.. కేసీఆర్ గుండ్లుపీకి గోళీలు ఆడుకుంట.. కేసీఆర్ నీ పేగులు తీసి మెడలో వేసుకుంట.. నీ ముడ్డిమీదున్న చెడ్డిగుంజుకుంట.. నిన్నుకొంచవోయి చర్లపల్లి జైలులో వేస్తా అంటున్నడు. ఇది మర్యాదనా?’ అంటూ ప్రశ్నించారు.
‘15 సంవత్సరాలు అన్నం తిన్నమో.. అటుకులు బుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి.. దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తొగవడి పోరాడింది నేను. నన్నుపట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడడమా? పది సంవత్సరాల పాలన ఎట్లా ఉండే ? కరెంటు ఎట్ల ఉండే? ఇవాళ వస్తుందా? మరి ఏం దుర్మార్గం ఇది. చేతనైత లేదా? ఒకడు ఏమో, ఒక పార్టీయేమో దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతది. ఇంకో పార్టీ ఇవాళ ఏం చేస్తుంది ? దేవుడిపై ఒట్లుపెట్టి ఓట్లు అడుగుతుంది. యాడికిపోతే అడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదగిరి నర్సన్న మీద ఒట్టు.. జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు.. బాసరపోయి సరస్వతి అమ్మవారి మీద ఒట్టు. ఈ ఓట్ల రాజకీయాలను నమ్ముతరా ఎవడైనా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా?’ అని ప్రశ్నించారు.
‘మహబూబ్నగర్ జిల్లాలో 25-30 ఎకరాలున్న రైతులు హైదరాబాద్కు వచ్చి ఆటోలు నడిపారు. గొడగొడ ఏడ్చిన్రు. ఉద్యమం జరిగే సమయంలో నాకే కలిశారు. అలాంటి వారిని ఆదుకోవాలని రైతుబంధు పెట్టాం. ఇవాళ దాన్ని మూడెకరాలకే వేస్తాం. ఐదెకరాలకే వేస్తాం. ఐదెకరాలు దాటితే ఇవ్వం.. నీ అయ్య జాగీరా? రైతులు తెలంగాణ బిడ్డలు కాదా? ఐదెకరాలు ఉన్నోడికి బంద్పెడితే.. ఆరో ఎకరమోడు ఎక్కడికి పోవాలి. వాడు ఏమైనా కోటీశ్వరుడు. 25 ఎకరాలు దాటాక బంద్ పెడితాంటే ఒక లెక్క. నేను గ్యారంటీగా చెబుతున్నా.. వీళ్లు రైతుబంధు ఉంచుతరో.. ఊడగొడుతరో నమ్మకం లేదు. రైతుబీమా ఉంటదో.. ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజుల్లో రైతాంగం, మన యువత అందరం ఏకమై కులమతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు బలం కావాలి. బీఆర్ఎస్కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాస్రెడ్డి గెలిస్తే మహబూబ్నగర్ బీఆర్ఎస్కు బలం వస్తుంది. బీఆర్ఎస్కు మీరిచ్చే శక్తి.. మీ శక్తే.. మీకే ఉపయోగపడుతుంది. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా.. గతంలో నేను వచ్చిన రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండంగా ఊరేగింపు తీసి.. అద్భుతమైన సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న’నన్నారు.