తిరువనంతపురం : వరకట్నాన్ని రూపుమాపేందుకు విద్యార్థి దశ నుంచే చర్యలు ప్రారంభం కావాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సూచించారు. ఇందుకుగాను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇచ్చేలా చూడటం సముచితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యాంటీ-ర్యాగింగ్ బాండ్ మాదిరిగానే ‘కట్నం తీసుకోం’ బాండ్పై విద్యార్థుల సంతకాలు తీసుకోవడం వల్ల వరకట్నం చావులను కొంతవరకైనా తప్పించవచ్చుననన్నారు. యూనివర్శిటీ డిగ్రీలు కట్నం తీసుకునేందుకు లైసెన్సులు కాకూడదని కేరళ విశ్వవిద్యాలయం వైస్ఛాన్స్లర్లతో సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యానించారు.
కేరళలో వరుసగా జరుగుతున్న వరకట్నం చావులపై సామాజిక అవగాహన కల్పించేందుకు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు చరమగీతం పాడేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఒకరోజు దీక్ష చేపట్టారు. అనంతరం కొల్లాం జిల్లాలో ఇటీవల వరకట్న వేధింపులతో చనిపోయిన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపేందుకు విద్యార్థులు నడుం బిగించాలన్నారు. విద్యార్థులు యూనివర్శిటీ కోర్సుల్లో చేరడానికి ముందుగా ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇవ్వాలని చెప్పారు. యూనివర్శిటీల్లో యాంటీ డౌరీ బాండ్ తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుముఖంగా ఉన్నారని కేరళ విశ్వవిద్యాలయాల ఛాన్స్లర్ కూడా అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు. వరకట్నం చావులు జరుగకుండా ఉండేందుకు ఎన్జీవోలు ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. కట్నం ఇవ్వం, కట్నం తీసుకోం అనే ఉద్యమాన్ని యుద్ధప్రాతిపదికగా చేపట్టాలని గవర్నర్ ఇటీవల మహిళలకు అప్పీల్ చేశారు.
యూజీసీ అకడమిక్ క్యాలెండర్ విడుదల
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
సోనియా గాంధీకి కెప్టెన్ ఘాటు లేఖ
ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్కు యూఎన్ లేఖ
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..