న్యూఢిల్లీ : ప్రస్తుత విద్యాసంవత్సరానికిగాను అకడమిక్ క్యాలెండర్ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం అన్ని యూనివర్శిటీలు, కాలేజీల్లో ప్రవేశాలు ఆగస్ట్ ఒకటి నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త సెషన్ మొదలవుతుంది. ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2021-22 విద్యా సంవత్సరంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల పనితీరుకు సంబంధించి యూజీసీ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని విశ్వవిద్యాలయాలు 2021 సెప్టెంబర్ 30 లోగా ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అకడమిక్ క్యాలెండర్లో ఆదేశించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చారు. ఏదేని కారణాల వల్ల 12 తరగతి బోర్డు ఫలితం ఆలస్యం అయితే, అక్టోబర్ 18 నుంచి కొత్త సెషన్ ప్రారంభించవచ్చునని తన మార్గదర్శకాల్లో యూజీసీ పేర్కొన్నది.
అధికారిక నోటీసు ప్రకారం, “టెర్మినల్ సెమిస్టర్ / ఫైనల్ ఇయర్ పరీక్షలు (2020-2021) తప్పనిసరిగా ఆఫ్లైన్ (పెన్ & పేపర్) / ఆన్లైన్ / బ్లెండెడ్ (ఆన్లైన్ + ఆఫ్లైన్) మోడ్లో 2021 ఆగస్టు 31 లోపు నిర్వహించాల్సి ఉంటుంది.” కరోనా ఇన్ఫెక్షన్ దృష్ట్యా అక్టోబర్ 31 వరకు ప్రవేశాలను రద్దు చేసిన విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయం రద్దు ఫీజు వసూలు చేయకూడదు. డిసెంబర్ 31 వరకు ప్రవేశాన్ని రద్దు చేసిన విద్యార్థికి ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.1000 వసూలు చేయవచ్చు. సెషన్ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో నడుస్తుందో లేదో నిర్ణయాధికారం యూజీసీ ఆయా రాష్ట్రాలకు వదిలివేసింది. విద్యాసంస్థల క్యాలెండర్, మార్గదర్శకాలను ఎన్ఐసీటీఈ, ఎన్సీటీఈ, బీసీఐ, ఎన్ఎంసీ, డీసీఐ, ఎన్ఐసీ, పీసీఐ, ఆయుష్ వంటి విద్యాసంస్థలతో సంప్రదించిన తర్వాత జారీ చేశారు. ఇలాఉండగా, హిమాచల్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో 12 వ తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలవ్వగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జూలై 31 లో బోర్డ్ ఫలితాలను అన్ని రాష్ట్రాలు విడుదల చేస్తాయనే భరోసాతో ఉన్నట్లు యూజీసీ తెలిపింది.
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
సోనియా గాంధీకి కెప్టెన్ ఘాటు లేఖ
ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్కు యూఎన్ లేఖ
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..