Lok Sabha Elections : లోక్సభ రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది. తొలి విడతలో 65.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో అంతకంటే తక్కువగా 60.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ మొత్తం 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగింది.
ఈ 88 నియోజకవర్గాల్లో కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో 8 చొప్పున, మధ్యప్రదేశ్లో 7, అసోం, బీహార్లో 5 చొప్పున, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్లలో మూడు చొప్పున, జమ్ముకశ్మీర్, మణిపూర్, త్రిపురల్లో ఒక్కో లోక్సభ స్థానానికి పోలింగ్ జరిగింది.
అంతేగాక ఈ విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, నటి హేమామాలిని, బీజేపీ నేత తేజస్వి సూర్య, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు.