కోల్కతా: నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి మూడేండ్ల క్రితం నాటి బాడీగార్డ్ కేసు చిక్కుకుంది. సువేందును ఇప్పటికే విచారించిన సీఐడీ అధికారులు.. శనివారం మరోసారి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. సువేందు బాడీగార్డ్ మృతిపై సీఐడీ దర్యాప్తునకు మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశించింది. సువేందు నివాసానికి వచ్చిన సీఐడీ బృందం మూడు రోజుల్లో రెండోసారి ప్రశ్నించింది. పాత మేదీనీపూర్ కాంతిలోని సువేందు ఇంటికి సమీపంలో ఉన్న బారక్లో బాడీగార్డ్ నివసిస్తుండేవాడు.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీఐడీ వారం క్రితమే తీసుకున్నది. అంతకుముందు బెంగాల్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. సువేందు అధికారి సెక్యూరిటీలో ఉన్న శుభబ్రత చక్రవర్తి 2018 లో తూర్పు మేదీనీపూర్ జిల్లాలోని కాంతి వద్ద ఉన్న పోలీసు బ్యారక్లో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అయితే, చక్రవర్తి భార్య సుపర్ణ.. కాంతి పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు చేసి తన భర్త మరణంపై దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కోరింది. దాంతో కాంతి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడంతో.. నాలుగు రోజుల క్రితం సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి ఇప్పటికే ఒకసారి సువేందును ప్రశ్నించారు. రాష్ట్ర సాయుధ పోలీసు సిబ్బందిగా ఉన్న చక్రవర్తి.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సువేందు అధికారి రవాణా శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత సెక్యూరిటీ గార్డుగా విధుల్లోకి వచ్చారు. తొలిరోజున సువేందు అందుబాటులో లేకపోవడంతో ఆయన సోదరుడు, ఎంపీ దివ్యేందు అధికారితో మాట్లాడి వెళ్లామని సీఐడీ అధికారులు చెప్తున్నారు.
ఆ ఫొటో జర్నలిస్ట్ను మేం చంపలేదు : తాలిబాన్
విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇవ్వాలి : కేరళ గవర్నర్
యూజీసీ అకడమిక్ క్యాలెండర్ విడుదల
మనం నిత్యం వాడే ‘ఎమోజీ’ గురించి తెలుసా..?
సోనియా గాంధీకి కెప్టెన్ ఘాటు లేఖ
ఆ గ్రామ ప్రజల్ని తరలించకండి: భారత్కు యూఎన్ లేఖ
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..