KKR vs PBKS : కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) తొలి వికెట్ పడింది. దంచికొడుతున్న ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(54) రనౌటయ్యాడు. సింగిల్ తీసే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. దాంతో, 93 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రభ్సిమ్రాన్ అయితే ఆకాశమే హద్దుగా ఆడాడు. బౌండరీల మీద బౌండరీలు బాదాడు. సునీల్ నరైన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్సర్తో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ చిచ్చరపిడుగు 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్లో బెయిర్స్టో సైతం గేర్ మార్చాడు. అంకుల్ రాయ్ వేసిన 6వ ఓవర్లో సిక్సర్, ఫోర్, ఫోర్, సిక్స్ బాదాడు. అయితే.. ఆఖరి బంతికి బెయిర్స్టో సింగిల్కు పిలవడంతో ప్రభ్సిమ్రాన్ రనౌట్ అయ్యాడు.