హైదరాబాద్: ఫార్మసీ కోర్సుల్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే నైపర్ జేఈఈ-2021 వాయిదాపడింది. కరోనా నేపథ్యంలో ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష జూన్ 5న జరగాల్సి ఉన్నది. ఈ క్రమంలో అప్లికేషన్ గడువును మే 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు రూ.3000 చెల్లించి అప్లయ్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా 968 ఎంఫార్మ్, 180 పీహెచ్డీ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు కల్పిస్తారు. జీపీఏ, గేట్, నెట్ క్వాలిఫై అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: niperhyd.ac.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి