monoclonal antibody treatment : ఒక్కరోజులోనే కరోనా లక్షణాలు ఖతం ! అది కూడా కేవలం ఒకే ఒక్క డోస్తోనే !! ఇటీవలే భారత్లోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సతో సాధ్యమైందీ అద్భుతం. ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి 40 మంది కోవిడ్ బాధితులు కేవలం 24 గంటల్లోనే కోలుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తాజాగా వెల్లడించారు. అసలు ఏంటి కాక్టెయిల్ ట్రీట్మెంట్ ? ఈ చికిత్స ఎవరికి అవసరం? దీనివల్ల ఎలాంటి దుష్ప్రభవాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
ఈ చికిత్సలో భాగంగా యాంటీబాడీలను శరీరంలోకి నేరుగా ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. దీనికోసం కరోనా వైరస్ను ఎదుర్కొనే కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ అనే యాంటీబాడీలను కలిపి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ను రూపొందించారు. ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఈ యాంటీబాడీలు sars-cov-2లోని స్పైక్ ప్రోటీన్లను నాశనం చేస్తాయి. కరోనా వైరస్ చుట్టూ ముళ్లలా ఉండే ఈ ప్రోటీన్ వల్లే శరీరంలోని ఏసీఈ2 కణాలకు ఈ వైరస్ అతుక్కుంటోంది. ఈ ప్రోటీనే లేకపోతే కరోనావైరస్ శరీరంలోని కణాలకు అతుక్కోలేదు. కాబట్టి స్పైక్ ప్రోటీన్ నాశనమైతే.. వైరస్ ఎక్కువసేపు బతకలేదు.
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మూడు నుంచి ఏడు రోజుల మధ్య ఈ కాక్టెయిల్ డ్రగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏడు రోజులు దాటిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు.
చర్మం కింద ఉండే కండరంలోకి లేదా నరాలకు ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ యాంటీబాడీ కాక్టెయిల్ ఒక డోసులో 600 మిల్లీగ్రాముల కాసిరివిమాబ్, 600 మిల్లీగ్రాముల ఇమ్డెవిమాబ్ మందులు ఉంటాయి. మొత్తం 1200 మిల్లీగ్రాములు ఉంటుంది. దీన్ని ఒక రోగికి 600 మిల్లీ గ్రాముల చొప్పున ఇద్దరు పేషెంట్లకు వాడవచ్చు. అయితే ఈ డ్రగ్ను ఓపెన్ చేసి ఒక పేషెంట్కు ఇచ్చిన తర్వాత 36 గంటల్లో ఇంకో పేషెంట్కు మిగిలిన డ్రగ్ను ఇవ్వాలి. ఈ డ్రగ్ను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మామూలు ఫ్రిజ్లో వీటిని భద్రపరచవచ్చు.
ఈ చికిత్స వల్ల పెద్దగా దుష్ప్రభవాలు ఉండవు. కాకపోతే కొంతమందిలో దురద, వికారం, వాంతులు వంటి సమస్యలు ఒకటి రెండు రోజులు ఉంటాయి.
ఈ కాక్టెయిల్ డ్రగ్ను ఇష్టం వచ్చినట్లుగా కరోనా బాధితులకు ఇవ్వడం మంచిది కాదు. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకే డ్రగ్ను ఇవ్వాలి. అతిగా ఈ డ్రగ్ను వినియోగించడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
రోచ్ ఇండియా, సిప్లా సంస్థలు ఈ డ్రగ్ను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీని ధరను ఒక్క డోసుకు రూ.59,750గా నిర్ణయించాయి. తొలి బ్యాచ్లో భాగంగా లక్ష డోసులను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని రెండు లక్షల మంది రోగులకు వినియోగించవచ్చు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడినప్పుడు ఈ డ్రగ్నే తీసుకున్నారు. అమెరికాలో ఇప్పటికే దాదాపు 13 వేల మంది ఈ కాక్టెయిల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. యూరప్ దేశాల్లోనూ ఈ చికిత్సను వాడుతున్నారు. తాజాగా ఈ చికిత్స భారత్లోకి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!