ముంబై: ఒక ఆలయంలోని పూజారులు రెచ్చిపోయారు. కొందరు భక్తులను ఈడ్చుకెళ్లారు. వారిని కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Priests Drag, Punch Devotees) మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ సంఘటన జరిగింది. స్థానిక జ్యోతిబా ఆలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కాగా, సాంప్రదాయ ప్రదక్షిణ, హారతి సమయంలో కొందరు భక్తులు దురుసుగా ప్రవర్తించినట్లు ట్రస్ట్ ఆరోపించింది. హారతి కార్యక్రమానికి వారు అంతరాయం కలిగించినట్లు తెలిపింది. పదేపదే హెచ్చరించినప్పటికీ వారు వినిపించుకోలేదని, పూజారులపై గులాల్ విసిరారని ట్రస్ట్ ఆరోపించింది. ఈ గందరగోళంలో సాంప్రదాయ తలపాగాలు కిందపడిపోవడంతో పూజారులు ఆగ్రహించినట్లు వెల్లడించింది.
మరోవైపు పరిస్థితి అదుపు తప్పడంతో సుమారు 20 మంది పూజారులు నిందితులైన భక్తులను ఆలయ ప్రాంగణంలోకి ఈడ్చుకెళ్లి కొట్టారు. భయంతో పారిపోవడానికి వారు ప్రయత్నించగా తిరిగి లాక్కెళ్లి మళ్ళీ కొట్టారు. ఆ భక్తులపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆ ఆలయం వద్ద గందరగోళం చెలరేగింది. అక్కడకున్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. పరిస్థితిని అదుపుచేశారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆలయ పూజారుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆలయ ప్రవిత్రతను కాపాడేందుకు పూజారులు ప్రయత్నించినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Kolhapur| Jyotiba Temple Incident | जोतिबा डोंगरावर आलेल्या भक्तांना पुजाऱ्यांकडून बेदम मारहाण; पाहा व्हिडिओ | NDTV मराठी#kolhapur #jyotiba_mandir #maharashtranews #ndtvmarathi #marathibatmya pic.twitter.com/o1QIm2DLKs
— NDTV Marathi (@NDTVMarathi) March 23, 2026
Also Read:
Kashmiris Donations To Iran | కశ్మీర్ ప్రజల విరాళాలు.. ఈ దయ మరువలేనిదన్న ఇరాన్
15 Deer Killed By Dogs | కుక్కల దాడిలో 15 జింకలు మృతి.. నలుగురు అటవీ శాఖ సిబ్బంది సస్పెండ్