సంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.