MLC Kavitha | జగిత్యాల : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు మే 6వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ రావాలని కోరుతూ కొండగట్టు ఆంజనేయ స్వామికి 116 కొబ్బరి కాయలు కొట్టారు. బోధన్కు చెందిన శేఖర్, శంకర్ కలిసి కొండగట్టు అంజన్నకు కొబ్బరికాయలు కొట్టి.. కవితకు బెయిల్ రావాలని ప్రార్థించారు.
రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని, వారిని అనుమానించడం కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టడమేనన్నారు. ఈడీ వాదనలపై రిజాయిండర్ లిఖితపూర్వకంగా ఇస్తామని కవిత తరఫు న్యాయవాది నితీశ్రాణా తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై మే 6న తీర్పు వెల్లడించనున్నట్టు తెలిపింది.
కవితకు బెయిల్ రావాలని దేవుడికి మొక్కులు
లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు త్వరగా బెయిల్ రావాలని కొండగట్టు ఆంజనేయస్వామికి 116 కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసిన బోధన్కు చెందిన శేఖర్ మరియు శంకర్. pic.twitter.com/q15b0T5Oam
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2024