నందికొండ, ఆగస్టు 10: వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. హిల్కాలనీ విజయవిహార్లో కృష్ణానది తీరంలో నిర్వహించిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయన సతీమణి గీతారెడ్డి పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో వేద పండితులు వరుణ యాగ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కృష్ణా, గోదావరి నదులు పరువళ్లు తొక్కాలని, జలాశయాలు నిండాలని కోరుతూ 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణలతో యాగశాలలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.20 నిమిషాల వరకు వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ యాగంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, మాజీ మంత్రి కుందూరి జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవాదాయ కమిషనర్ హనుమంతురావు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.