నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్కు గురువారం పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో సువేందు మాత్రం గాయపడలేదు. నందిగ్రామ్లోని సతేన్గబరి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సువేందు కాన్వాయ్ వెంటే ఉన్న మీడియా వాహనం ఈ రాళ్ల దాడిలో ధ్వంసమైంది.
మరోవైపు పశ్చిమ మిడ్నాపూర్లో మరో బీజేపీ అభ్యర్థి ప్రీతిశరంజన్ కోనార్ కాన్వాయ్పై కూడా దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రెండో విడతలో భాగంగా బెంగాల్లో నందిగ్రామ్ సహా 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే ఇక్కడ జరిగిన హింసలో ఓ బీజేపీ కార్యకర్త మృతి చెందాడు.
ఇవీ కూడా చదవండి..
కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్ఖాన్
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్లో చెమటోడ్చిన ధోనీ, రైనా