ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఎన్నడూ లేని విధంగా గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మునుపటి ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతోంది. గత సీజన్కు మిస్ అయిన స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా తిరిగి టీమ్లోకి రావడం ఆ టీమ్కు ప్లస్ పాయింట్. అతనితోపాటు కెప్టెన్ ధోనీ నెట్స్లో చెమటోడుస్తున్నారు. ఈ నెల 10న ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్.. ముంబైలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.
ఇందులో భాగంగా ఈ ఇద్దరు ప్లేయర్స్ ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ సీజన్కు కొత్తగా మొయిన్ అలీ, క్రిష్ణప్ప గౌతమ్ లాంటి ప్లేయర్స్ టీమ్తో చేరారు. అయితే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ మాత్రం 14వ సీజన్కు దూరంగా ఉండాలని నిర్ణయించాడు. వరుస బబుల్స్కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్నట్లు హేజిల్వుడ్ చెప్పాడు.
ఇవీ కూడా చదవండి..
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి