దుబాయ్ : సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ కొత్త నియమం తీసుకొచ్చాడు. మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి, ఉపన్యాసాలు ప్రసారం చేసేందుకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదంటూ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఉన్నలౌడ్ స్పీకర్ల ధ్వనిని మూడో వంతు వరకు తగ్గించాలని సౌదీ పాలకుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మసీదుల పరిసరాల్లోని చాలా మంది తల్లిదండ్రులు, నివాసితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలకు ఉపక్రమించారు.
ప్రార్థనలు చేయాలనుకునే వారు ఇక ఇమామ్ స్వరం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంటల్ మంత్రి అబ్దుల్లాతీఫ్ అల్-షేక్ చెప్పారు. ముస్లింలకు అజాన్, నమాజ్ చేసేందుకు నిర్ణీత సమయం ఉంటున్నందున.. వీటిని పెద్ద గొంతుతో ప్రసారం చేయాల్సిన అవసరం లేదన్నారు. “కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టాలని చూసున్నారని, ఇది మంచిది కాదు. వారు విజయం సాధించలేరన్నారు.
సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది ప్రజలు స్వాగతించారు. దీనిని సోషల్ మీడియాలో ‘భవిష్యత్ నిర్ణయం’ అని పిలుస్తున్నారు. ఈ నిర్ణయం కొంతమందిని కలవరపెడుతుంది, అయితే, చాలా మందికి ఇది ఎంతో బాగుందని మొహమ్మద్ అల్ యాహ్యా అన్నారు.
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఇజ్రాయెల్లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..