బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాంకోఠి సెంటినరీ వెస్లీ చర్చిలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, దేవీ ప్రసాద్రావు తదితరులు 50 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీరాములు ముదిరాజ్ తన స్నేహితుడి సహకారంతో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు.