పాట్నా: బిహార్లో కరోనా ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. పరిస్థితులను అధిగమించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ ఈ నెల 15 వరకు అమలులో ఉంటాయి. బిహార్లో 18-44 ఏండ్ల మధ్య వయసు వారికి టీకాలు వేయడం ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇలాఉండగా, బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. కరోనా వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రానికి సాధ్యమైనంత సహాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.
పంజాబ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కరోనా చైన్ను విడగొట్టడానికి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీకా గురించి సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా బిహార్ ఆరోగ్య సేవల గురించి నితీష్ కుమార్ ప్రధానికి తెలియజేశారు.
రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ, కరోనా సంఖ్య నిలిపోవడంలేదు. ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో కొత్తగా 12,948 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 గంటల్లో ఇన్ఫెక్షన్ కారణంగా 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.12 లక్షలకు పెరిగింది. గత 24 గంటల్లో 15 వేల మంది కరోనాను ఓడించి డిశ్చార్జి అయ్యారు.
బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్బుక్ ఐడీ హ్యాక్
దీదీ కోసం నా సీటును వదులుకుంటా : ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ
యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడగింపు
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..