అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ప్రపంచంలోని మొట్టమొదటి జనన నియంత్రణ మాత్ర (బర్త్ కంట్రోల్ పిల్) ను 1960 లో సరిగ్గా ఇదే రోజున ఆమోదించింది. ఈ మాత్రకు ఇన్నోవిడ్ -10 అని పేరు పెట్టారు. దీనిని జీడీ సియర్ల్ అనే సంస్థ సృష్టించింది.
మార్గరెట్ సాంగెర్ అనే అమెరికన్ నర్సు ఆలోచన నుంచి జనన నియంత్రణ మాత్ర ఆవిర్భవించింది. సాంగెర్ దాదాపు 50 సంవత్సరాలపాటు దీని కోసం పోరాడారు. 1916 లో న్యూయార్క్లోని బ్రూక్లిన్లో అమెరికా మొదటి జనన నియంత్రణ క్లినిక్ను ప్రారంభించారు. ప్రపంచంలోని చాలా దేశాలలో జనన నియంత్రణ, గర్భస్రావం చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్న కాలం ఇది. ఈ కారణంగా ఈ క్లినిక్ కేవలం 10 రోజుల్లోనే మూతపడింది.
మరుసటి ఏడాది న్యూయార్క్ కోర్టు సాంగర్కు 30 రోజులు జైలు శిక్షించింది. 1914 లో ‘ఫ్యామిలీ లిమిటేషన్’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని కూడా నిషేధించారు. ఆమెపై కేసు పెట్టడంతో దేశం నుంచి పారిపోవలసి వచ్చింది. ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో 1917 లో ‘బర్త్ కంట్రోల్ రివ్యూ’ అనే పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. ప్రజలకు కుటుంబ నియంత్రణ సమాచారం ఇచ్చినందుకుగాను 1917 లో జైలు శిక్ష అనుభవించారు. 1940 నాటికి సాంగెర్ ప్రయత్నాల వల్ల జనన నియంత్రణకు సంబంధించిన 400 క్లినిక్లు అమెరికాలో ప్రారంభమయ్యాయి.
సుదీర్ఘ చర్చల అనంతరం జంతు శాస్త్రవేత్త గ్రెగొరి పిన్కస్ 1953 లో జాన్ రోక్తో కలిసి జనన నియంత్రణ మాత్రను తయారు చేయడం ప్రారంభించారు. 1959 అక్టోబర్ 29 న ఫార్మా కంపెనీ జీడీ సెరల్స్ ఈ మాత్రను రూపొందించడానికి అనుమతి కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తు చేయడంతో 1960 లో ఆమోదం లభించింది. రెండు రోజుల తర్వాత మే 11 న ఎఫ్డీఏ తన ఆమోదాన్ని బహిరంగంగా ప్రకటించింది.
అప్పటి నుండి, ఈ మాత్రల వాడకం పెరగడం ప్రారంభమైంది. ప్లాన్డ్ పేరెంట్హుడ్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికా ప్రకారం, 1965 నాటికి 45 ఏండ్లలోపు ప్రతి నాల్గవ వివాహిత మహిళ గర్భం రాకుండా ఉండటానికి ఈ మాత్రలు వాడటం ప్రారంభించింది. 1970 లో పెళ్లికాని మహిళలు ఈ మాత్రలను వాడటానికి యుఎస్ అనుమతించింది. అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఈ మాత్రలు ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
2012: స్వలింగ వివాహానికి ఆమోదం తెలిపిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
2009: చంద్రునిపై నీటి కోసం వెతకడానికి నిఘా దర్యాప్తును పంపిన నాసా
2009: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎంపికైన జాకబ్ జుమా
2004: చెచ్న్యాలో జరిగిన పేలుడులో అధ్యక్షుడు అఖ్మెద్ కదరోవ్ మరణం
1998: భారతీయ గజల్ గాయకుడు, నటుడు తలాత్ మెహమూద్ మరణం
1986: ఎవరెస్ట్ పర్వతానికి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి టెన్జింగ్ నార్గే మరణం
1955: నాటోలో సభ్యత్వం పొందిన పశ్చిమ జర్మనీ
1947 : తన తొలి రుణాన్ని ఫ్రాన్స్కు అందజేసిన వరల్డ్ బ్యాంక్
1901: ఆస్ట్రేలియా మొదటి పార్లమెంట్ మెల్బోర్న్లో ప్రారంభం
1866 : స్వాతంత్ర్య సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే జననం
1653: పూర్తయిన తాజమహల్ నిర్మాణ పనులు
1540: మహారాణా ప్రతాప్ రాజస్థాన్ లోని కుంభాల్ ఘడ్ లో జననం
1502: స్పెయిన్కు నాలుగో, చివరి ప్రయాణాన్ని ప్రారంభించిన క్రిస్టోఫర్ కొలంబస్
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
25 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెలకొల్పాడు..
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..