ఖాట్మండు : నేపాల్కు చెందిన 52 ఏండ్ల వ్యక్తి 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును నెలకొల్పాడు. కామి రీటా షెర్పా ఈయన 25 వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలోని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.
ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని కామి రీటా 2019 లో 24 వ సారి అధిరోహించాడు. తొలిసారి 1994 మే నెలలో ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నాడు. 1994-2021 మధ్య కామి రీటా ఎవరెస్ట్ శిఖరాన్ని 25 సార్లు, కే 2, మౌంట్ లోట్సే ఒకసారి, మనస్లు పర్వతాన్ని మూడుసార్లు, చో ఏజ్ పర్వతాన్ని ఎనిమిది సార్లు అధిరోహించాడు.
ఖాట్మండు ఆధారిత సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రకారం, కామి రీటా సాయంత్రం 6 గంటలకు చుచురో చేరుకున్నాడు. ఈయన ప్రస్తుత సీజన్లో తాడు తయారీ బృందానికి నాయకత్వం వహించాడు. ఈయనతో పా 12 మంది షెర్పాస్ గురువారం సాయంత్రం 6 గంటలకు నాల్గవ శిబిరం నుంచి బయల్దేరారు. ఈ బృందంలో కామి రీటా, శంఖువాసభ నుంచి ఆరుగురు షెర్పా అధిరోహకులు, సోలుఖంబు నుంచి ఆరుగురు ఉన్నారు. వీరు మూడు రోజుల క్రితం మంగళవారం బేస్ క్యాంప్ నుంచి బయల్దేరారు. వీరంతా శనివారం రాత్రికి తిరిగి వస్తారని సెవెన్ సమ్మిట్ తెలిపింది.
పర్యాటక శాఖ 44 బృందాలకు మాత్రమే ఎవరెస్ట్ అధిరోహనకు అనుమతించింది. వీరిలో 92 మంది మహిళలు, 315 మంది పురుషులు ఉన్నారు.
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
పాకిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
బెంగాల్ స్పీకర్గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..