హైదరాబాద్ : నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటీఎంలో వింత సమస్య చోటు చేసుకున్నది. ఏటీఎం కార్డు నుంచి నగదు విత్డ్రా చేస్తున్న సమయంలో బ్యాంకు మూలధనం ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవుతోంది. కస్టమర్ల నుంచి ఖాతా నుంచి డెబిట్ కావాల్సి ఉండగా.. బ్యాంకు మూలధనం నుంచి డెబిట్ అయ్యాయి. రాంనగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. బ్యాంకు మూలధన అకౌంట్ నుంచి రూ.3.40లక్షలు విత్డ్రా అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే, సమస్యకు గల కారణాలు అంతుపట్టడం లేదు. సాఫ్ట్వేర్ లోపంపై సాంకేతికంగా ఆధారాలు లభించలేదు. ఒకే ఏటీఎం నుంచి నగదు డెబిట్ అవుతుండడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది సైబర్ నేరగాళ్ల పనే అయివుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై బ్యాంకు మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.