అమరావతి : ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉగంటూరు మండలం బాదంపుడి వద్ద జాతీయ రహదారిపై కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.