న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. శుక్రవారం కేవలం పెట్రోల్ ధర పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా డీజిల్ ధరలను సైతం పెంచాయి. తాజాగా పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 20 పైసల వరకు వడ్డించాయి. పెరిగిన ధరలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.51, డీజిల్ రూ.89.36కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.98, డీజిల్ రూ.96.91కు పెరిగింది. మే 4వ తర్వాత నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు 35 సార్లు పైకి కదలగా.. ఇప్పటి వరకు మొత్తం రూ.9.19 వరకు పెరిగింది. డీజిల్ రేట్లు 34 సార్లు పెరగ్గా.. రూ.8.57 వరకు పెరుగుదల నమోదైంది.
ఈ వారం వియన్నాలో ఒపెక్ దేశాలు సమావేశమయ్యాయి. ఇందులో రాబోయే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ముడి చమురు ఉత్పత్తిని పెంచే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, 11 గంటల పాటు సమావేశం జరిగినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ముడి చమురు మార్కెట్లను నిరాశపరిచింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి, బ్రెంట్ ముడి బ్యారెల్కు 76.17 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది ముందు రోజు కంటే 0.33 డాలర్లు ఎక్కువ. అదేవిధంగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు బ్యారెల్కు 0.07 డాలర్లు తగ్గి.. 75.16 వద్ద ముగిసింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు
ఢిల్లీలో పెట్రోల్ రూ.99.51.. డీజిల్ రూ.89.36
ముంబైలో పెట్రోల్ రూ.105.98.. డీజిల్ రూ.96.91
కోల్కతా పెట్రోల్ రూ.99.44.. డీజిల్ రూ.92.27
చెన్నైలో పెట్రోల్ రూ.100.44.. డీజిల్ రూ.94.72
బెంగళూరులో పెట్రోల్ రూ.102.84.. డీజిల్ రూ.94.54
హైదరాబాద్లో పెట్రోల్ రూ.103.41.. డీజిల్ రూ.97.40
పాట్నాలో పెట్రోల్ రూ.101.62.. డీజిల్ రూ.94.76
చండీగఢ్లో పెట్రోల్ రూ.95.70.. డీజిల్ రూ.89
భోపాల్లో రూ.107.80.. డీజిల్ రూ.98.13
లక్నోలో పెట్రోల్ రూ.96.65.. డీజిల్ రూ.89.75
రాంచీలో పెట్రోల్ రూ.94.89.. డీజిల్ రూ.94.31