న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి మొబైల్ నుంచి డేటా గూగుల్, ఆపిల్లకు చేరుతుందని అందరికీ తెలుసు. అయితే ప్రతి ఐదు నిమిషాలకు మీ మొబైల్లోని డేటా గూగుల్, ఆపిల్లకు చేరుతుందన్న విషయం మీకు తెలుసా? ఐర్లాండ్లోని ట్రినిటీ కాలేజ్ రీసెర్చర్ డగ్లస్ లీత్ చేసిన అధ్యయనంలో కొన్ని సంచలన విషయాలు వెలువడ్డాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్ వాడుతున్న యూజర్ల నుంచి గూగుల్, ఆపిల్ ఏ డేటాను ఎలా సేకరిస్తున్నాయన్న అంశంపై అధ్యయనం నిర్వహించారు.
మొబైల్ వాడకపోయినా..
తాజా అధ్యయనం ప్రకారం ప్రతి 4.5 నిమిషాలకు మీ మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్కు చేరుతూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ అయితే గూగుల్కు, ఐఓఎస్ అయితే ఆపిల్కు మీ మొబైల్లోని సమాచారం వెళ్తుంది. అంతేకాదు అసలు మీరు మొబైల్ను వాడకపోయినా కూడా అందులోని డేటా మాత్రం వాళ్లకు చేరుతూనే ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఫోన్ ఐఎంఈఐ, హార్డ్వేర్ సీరియస్ నంబర్, సిమ్ సీరియల్ నంబర్, ఐఎంఎస్ఐ, హ్యాండ్సెట్ ఫోన్ నంబర్, ఇతర సమాచారాన్ని ఆపిల్, గూగుల్కు చేరవేస్తాయి. మీరు మొబైల్లో సిమ్ వేసిన వెంటనే ఆ సమాచారం కూడా వాటికి తెలిసిపోతుంది.
డేటా బదిలీపై నియంత్రణ లేదు
డేటా బదిలీపై ఇప్పటికే యూజర్లకు నియంత్రణ లేదని ఈ అధ్యయనం తేల్చింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ షేర్ అయిన డేటాలో యూజర్ పేరు, ఇమెయిల్ అడ్రెస్, పేమెంట్ కార్డుల వివరాలు కూడా ఉంటున్నాయి. ఇక డివైజ్ ఐపీ అడ్రెస్తో యూజర్ లొకేషన్ కూడా ఈ కంపెనీలు తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడే ఎక్కువ
ఆపిల్తో పోలిస్తే ఆండ్రాయిడ్ 20 రెట్లు ఎక్కువ డేటాను యూజర్ల నుంచి సేకరించి గూగుల్కు షేర్ చేస్తున్నట్లు లీత్ చేసిన అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉన్న గూగుల్ పిక్సెల్ 2, ఐఓఎస్ 13.6.1 ఉన్న ఐఫోన్ 8లను లీత్ వాడారు. ఆండ్రాయిడ్ గూగుల్ సెర్చ్ బార్, క్రోమ్, యూట్యూబ్, గూగుల్ డాక్స్, సేఫ్టీహబ్, గూగుల్ మెసెంజర్, డివైజ్ క్లాక్ నుంచి డేటా సేకరిస్తున్నట్లు గుర్తించారు అదే ఐఓఎస్ మాత్రం సిరి, సఫారీ, ఐక్లౌడ్ నుంచి డేటా సేకరిస్తోంది. ఫోన్ అసలు వాడకపోయినా 12 గంటల వ్యవధిలో 1 ఎంబీ డేటాను ఆండ్రాయిడ్ షేర్ చేసిందని కూడా ఈ అధ్యయనం చెప్పింది. అయితే గూగుల్ మాత్రం ఈ అధ్యయనాన్ని ఖండించింది. ఐఓఎస్ కంటే 20 రెట్లు ఎక్కువ షేర్ చేస్తోంది అన్నది తప్పని, అధ్యయనం కోసం ఉపయోగించిన పద్ధతి సరిగా లేదని గూగుల్ అధికార ప్రతినిధి అన్నారు. ఇలాంటి డేటా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్న డివైజ్ల నుంచి సేకరించడం సహజమేనని చెప్పింది.
ఇవీ కూడా చదవండి..
సుయెజ్ కాలువ నష్టం.. 100 కోట్ల డాలర్ల పరిహారం కోరుతున్న ఈజిప్ట్
చెన్నైలో విరాట్ కోహ్లి.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఆర్సీబీ
భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీకి రజనీకాంత్ థ్యాంక్స్
నందిగ్రామ్లో హింస.. సువేందు కాన్వాయ్పై రాళ్ల దాడి
కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్ఖాన్
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి