కైరో: సుయెజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోవడం ద్వారా కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతోంది ఈజిప్ట్. 100 కోట్ల డాలర్ల పరిహారం అడగాలని భావిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. అయితే ఈ పరిహారం ఎవరి నుంచి కోరుతోందో మాత్రం చెప్పలేదు. వారం రోజుల పాటు నౌక ఇరుక్కోవడం వల్ల నష్టపోయిన రవాణా ఫీజు, నౌకను రక్షించే చర్యలకు అయిన ఖర్చు, ఈ సందర్భంగా కలిగిన నష్టాలు కలిపి 100 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుయెజ్ కెనాల్ అథారిటీ సీఈవో ఒసామా రాబీ చెప్పారు.
పరిహారం ఈజిప్ట్ దేశ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. మార్చి 23న కాలువలో అడ్డంగా ఇరుక్కున్న ఎవర్ గివెన్ నౌక 29వ తేదీన తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నౌకను అద్దెకు తీసుకున్న తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్.. రవాణాలో ఆలస్యానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ నౌక, అందులోని సరుకుల మొత్తం విలువ 350 కోట్ల డాలర్లని రాబీ వెల్లడించారు.
ఇవీ కూడా చదవండి..
చెన్నైలో విరాట్ కోహ్లి.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఆర్సీబీ
భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీకి రజనీకాంత్ థ్యాంక్స్
నందిగ్రామ్లో హింస.. సువేందు కాన్వాయ్పై రాళ్ల దాడి
కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్ఖాన్
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి