ముంబై : మహారాష్ట్రలోని పాల్ఘర్లో గురువారం ఉదయం 11.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. నాసిక్కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ నెల 21న అసోం నాగాన్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 2.8 ప్రకంపనలు వచ్చాయి. తేజ్పూర్కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.