న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త ఉత్పరివర్తనంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వేరియంట్కు, థర్డ్ వేవ్కు సంబంధం లేదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. ‘డెల్టా ప్లస్ వేరియంట్, థర్డ్ వేవ్కు సంబంధం ఉందని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు’ అన్నారు. అయితే, సెకండ్ వేవ్లో రక్షణ చర్యలు తగ్గించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇన్స్టిట్యూట్ జూన్ నెలలో మహారాష్ట్ర నుంచి 3,500 కన్నా ఎక్కువ నమూనాలను క్రమబద్ధీకరించిందని.. ఏప్రిల్, మే నుంచి నమూనాలను పరిశీలించామన్నారు.
ఇవి (డెల్టా ప్లస్ వేరియంట్లు) చాలా ఉన్నాయని, అయితే ఇవి ఒక శాతం కన్నా తక్కువగా ఉంటాయన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అవి ‘చాలా ఎక్కువ’ కాదని అన్నారు. ఉత్పరివర్తనం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40కిపైగా నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తక్షణ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరింది. అయితే, ప్రస్తుతం మనం కరోనా సెకండ్ వేవ్ ముగియకపోవడంపై ఆందోళన చెందాలని.. డెల్టా ప్లస్, థర్డ్ వేవ్పై కాదన్నారు.