హైదరాబాద్, జూలై 31: ఐఐఆర్ఎం హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ నిధుల సేకరణకు శ్రీకారంచుట్టింది. కార్పెడియమ్ క్యాపిటల్, సాన్షి ఫండ్-1 లీడ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ రౌండ్లో రూ.150 కోట్ల నిధులను సమకూర్చుకోనున్నట్టు ప్రకటించింది.
ఈక్విటీ షేర్లు, ఫుల్ కన్వర్టబుల్ వారెంట్లను జారీ చేయడం ద్వారా ఒక్కో షేరుకు రూ.143.28 చొప్పున ఈ భారీ స్థాయిలో నిధులను సేకరించనున్నట్టు తెలిపింది.