తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా ఈఓ జవహర్రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయ బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు అదనపు ఈఓ ధర్మారెడ్డి సైతం కన్వీనర్గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 21న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈఓను చైర్మన్గా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం.. ప్రభుత్వం ఈఓ, అదనపు ఈవోలతో అథారిటీని ఏర్పాటు చేసింది. అథారిటీకి అన్ని అధికారాలు ఉంటాయని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధర్మకర్తల మండలి నిర్వహించే అన్ని విధులను నిర్వహిస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంతకు ముందే తెలిపారు.