న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల వాడకంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము వ్యాక్సిన్లు పంపిస్తూనే ఉంటామని, రెండో డోసు కోసం ఎవరూ దాచిపెట్టొద్దని స్పష్టం చేసింది. డిమాండ్ ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూనే ఉండాలని సూచించింది. వ్యాక్సిన్ల కొరత లేదని స్పష్టం చేసింది. రెండో డోసు కోసం వ్యాక్సిన్లను నిల్వ చేయడంలో అర్థమే లేదని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) సీఈవో ఆర్ఎస్ శర్మ అన్నారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్తో కలిసి ఆర్ఎస్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ స్థితి, అది సాగుతున్న వేగం, సమస్యలపై చర్చించారు. వ్యాక్సిన్ల స్టోరేజీ ఎక్కడా ఎక్కువ లేదా తక్కువ కాకుండా చూసుకుంటున్నట్లు ఈ సందర్భంగా రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వృథాను 1 శాతం కంటే తక్కువ పరిమితం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. గడువు ముగిసేలోపే వ్యాక్సిన్లను వాడేలా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. కేవలం అర్హత కలిగిన లబ్ధిదారులే వ్యాక్సిన్లను పొందేలా చూడాలనీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..