Mother Killed Baby : ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్గూడలో మాతృత్వానికి మచ్చ తెచ్చింది ఓ తల్లి. నవమాసాలు మోసి కన్న పసిగుడ్డును కర్కశంగా చెరువులో ముంచి చంపేసిందో మహిళ. ఈ
ఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటలకు జరిగింది. మృతి చెందిన పాపాయిని 9 నెలల లోకసాని అనురాధగా గుర్తాంచారు. నిందితురాలైన తల్లి పేరు లోకసాని రాజేశ్వరి (34).
బైరామల్గూడలో 9 నెలల చిన్నారి ప్రాణాలు తీసిందో కన్నతల్లి. ఇంజాపూర్లో నివసించే లోకసాని రాజేశ్వరీ అభశుభం తెలియని చిన్నపాపాయిని చెరువులో ముంచి చంపేసింది. విషయం తెలుసుకున్న పోటీసులు ఘటనాస్థలికి చేరుకొని.. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కన్నబిడ్డనే అమానుషంగా హత్య చేసిన రాజేశ్వరీ.. మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన కారణాలు తెలుసుకునేందుకు ఆమెను విచారిస్తున్నారు.