జింద్ : కేంద్రం తీసుకొచ్చి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మాపై కక్షగట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని శిక్షించేందుకే దేశ రాజధానిలో అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ చేతులకు అప్పగించారన్నారు.
ఆదివారం హర్యానా రాష్ట్రంలోని జింద్లో కిసాన్ మహాపంచాయతీని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. అంతకుముందు రైతుల నిరసన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు అర్పించారు.
వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నందునే వారికి మద్దతుగా నిలిచామని కేజ్రీవాల్ చెప్పారు. ‘కేజ్రీవాల్ను శిక్షించాలన్న ఏకైక లక్ష్యంతో వారు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నిరసనకు మద్దతు ఇచ్చినందుకు మేం ప్రతిఫలాలను ఎదుర్కొన్నాం. వారు బిల్లును ఆమోదించడం ద్వారా, ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి అధికారాన్ని అప్పగించడం ద్వారా వారు మాకు శిక్ష వేస్తున్నారు. దీని కోసం స్వాతంత్ర్య పోరాటం చేయాలా?’ అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన సమయంలో మరణించిన 300 మంది త్యాగాలకు వందనం చేస్తున్నామని, వారి త్యాగం వృధాకాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉన్నదని కేజ్రీవాల్ చెప్పారు.
స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..