న్యూఢిల్లీ: దళిత, మహిళా పారిశ్రామికవేత్తలకు సులువుగా నిధులు సమకూర్చడానికి స్టాండప్ ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.25,586 కోట్లు మంజూరు చేసింది.ఈ పథకం ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2021 మార్చి 23 వరకు 1,14,322 కు పైగా ఖాతాలకు స్టాండప్ ఇండియా పథకం కింద రూ.25,586 కోట్లు మంజూరయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు శక్తివంతులు, ఉత్సాహవంతులు. కానీ వారి కలలను వాస్తవికతగా మార్చడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లను గుర్తించి, ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్టాండప్ ఇండియా పథకాన్ని 2016 ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని 2025 వరకు పొడిగించారు’ అని ఆ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..