ఆనంద్ మహీంద్ర కానుక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రూపాయికే ఇడ్లీ అమ్ముతూ ‘ఇడ్లీ అమ్మ’గా రెండేండ్ల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన తమిళనాడుకు చెందిన వృద్ధురాలు కమలాత్తాళ్ గుర్తున్నారా? 2019లో ఆమె వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్టు చేయడంతో ఆమెకు ప్రాచుర్యం లభించింది. వడివేలంపాలయం గ్రామంలో 37 ఏండ్లుగా ఇడ్లీలు అమ్ముతూ ఆమె జీవనం సాగిస్తున్నారు. మళ్లీ ఆమె వీడియోను ఆనంద్ మహీంద్ర పోస్టు చేశారు. ఎనిమిది పదుల వయసున్న ‘ఇడ్లీ అమ్మ’కు ఇల్లు సమకూరుస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా తొలిగింపు
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక