శాస్త్రవేత్త నంబినారాయణ్ కేసులో కేరళ పోలీసులపై దర్యాప్తు పూర్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇస్రో పరిశోధనల వివరాల్ని విదేశీయులకు అమ్ముతున్నారన్న ఆరోపణలతో శాస్త్రవేత్త నంబినారాయణ్పై నమోదైన కేసు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నతస్థాయి దర్యాప్తు సంఘం తన నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే నివేదికలో ఏం ఉందనేది వెల్లడించలేదు. 1994లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ‘ఇస్రో కుట్ర కేసు’గా పేరొందింది. అంతరిక్ష పరిశోధనల సమాచారాన్ని నంబినారాయణ్, మరో శాస్త్రవేత్త అమ్ముకొంటున్నారని 1994లో వారిపై కేసు నమోదైంది. కేరళ పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అయితే సీబీఐ దర్యాప్తులో శాస్త్రవేత్తలు నిర్దోషులు అని తేలింది. దీంతో కేరళ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నంబినారాయణ్ కోర్టుకెక్కారు. కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి డీకే జైన్ నేతృత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది.
ఇవి కూడా చదవండి :
దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా తొలిగింపు