Vir Vikram Yadav : డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన చీఫ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ బ్యూరోక్రాట్ల సాధారణ బదిలీలలో భాగంగా వీర్ విక్రమ్ యాదవ్కు ఈ బాధ్యతలు అప్పగించింది కేంద్రం.
ఇప్పటివరకు ఈ పదవిలో ఫయాజ్ అహ్మద్ కిడ్వాయ్ కొనసాగారు. ఆయన స్థానంలో వీర్ విక్రమ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన 1996 ఐఏఎస్ (ఒడిశా) బ్యాచ్కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అదనపు సెక్రెటరీగా పని చేస్తున్నారు. తాజాగా కేంద్రం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. దీని ప్రకారం.. ఫయాజ్ అహ్మద్ కిడ్వాయ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీగా, పునీత్ కన్సాల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అడిషనల్ సెక్రెటరీగా, విశాల్ గగన్ సీఐసీ సెక్రెటరీగా, శ్రీధర్ చిరువోలు పీఎంవో అడిషనల్ సెక్రెటరీగా, జ్ఞానేంద్ర త్రిపాఠి ఐసీఏఆర్ అడిషనల్ సెక్రెటరీగా, అన్సుమాన్ పట్నాయక్ కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీగా నియామకమయ్యారు.
వీరితోపాటు పలువురు ఐఏఎస్ అధికారుల్ని కేంద్రం బదిలీ చేసింది. ఈ మేరకు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆదేశాలు జారీ చేసింది.