ముంబై : ఎయిర్టెల్-జియో టెలికాం సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలోని మూడు సర్కిళ్లలో తమ స్పెక్ట్రంను జియోకు ఎయిర్టెల్ బదలాయించనున్నది. ఈ విషయాన్ని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించాయి.
సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ సంస్థ తమకు చెందిన 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను రిలయన్స్ జియో సంస్థ వాడుకునేలా ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.75 మెగాహెర్ట్జ్, ఢిల్లీలో 1.25 మెగాహెర్ట్జ్, ముంబైలో 2.50 మెగాహెర్ట్జ్ వాడుకునేందుకు భారతి ఎయిర్టెల్ సంస్థ అంగీకరించింది. ఇందుకుగాను జియో సంస్థ ఎయిర్టెల్కు రూ.1,037.6 కోట్లు చెల్లించనున్నారు.
‘ఈ మూడు సర్కిళ్లలో 800 మెగాహెర్ట్జ్ బ్లాక్ల అమ్మకం మాకు ఉపయోగపడని స్పెక్ట్రం నుంచి విలువను అన్లాక్ చేయడానికి దోహదపడింది. ఇది మా మొత్తం నెట్వర్క్ వ్యూహానికి అనుగుణంగా ఉంటుంది’ అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ చెప్పారు. జియో ఈ స్పెక్ట్రంను ఉపయోగించుకునే హక్కుతో ముంబై సర్కిల్లోని 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో 2X15 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ సర్కిళ్లలోని 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో 2X10 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ఉంటుంది. తద్వారా దాని స్పెక్ట్రం ఫుట్ ప్రింట్ను మరింత పటిష్టం చేస్తుంది. పరస్పర స్పెక్ట్రం, ఉన్నతమైన మౌలిక సదుపాయాలతో ఆర్జేఐఎల్ తన నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచిందని ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని టెల్కో తెలిపింది.
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..