ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దక్షిణ ప్రావిన్సుల్లో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న ఆఫ్ఘాన్ శరణార్థులు తమ వ్యాక్సిన్ వద్దు.. డబ్బు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మేం ఉంటున్న శిబిరాల్లో ఇంతవరకు ఒక్క కొవిడ్-19 కేసు కూడా బయటకు రాలేదని, అందుకే వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.
వ్యాక్సిన్లు వేసే కార్యక్రమానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆఫ్ఘన్ శరణార్థుల ప్రతినిధులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తమ శిబిరాల్లో ఎవరూ చంపలేదని వారు చెప్తున్నారు. శరణార్థుల్లో వైరస్ గురించి అవగాహన లేకపోవడం గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 54 శిబిరాల్లో కనీసం 1.4 మిలియన్ల మంది ఆఫ్ఘన్ శరణార్థులు నివసిస్తున్నారు. ఎక్కువగా వాయవ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా, నైరుతి బెలూచిస్తాన్ ప్రావిన్సుల్లో వీరు ఉంటున్నారు. ఈ రెండూ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి. కరాచీ, ఇస్లామాబాద్ వంటి పెద్ద పట్టణ కేంద్రాలలో కూడా శరణార్థుల స్థావరాలు ఉన్నాయి.
ఆఫ్ఘన్ శరణార్థులు దేశంలో ఆస్తి, వాహనాలు, సిమ్ కార్డులను కొనుగోలు చేయకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంటున్నది. వీరి చిన్నారులు పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలకు హాజరు కావడంలేదు. నవజాత శిశువులకు జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో దవఖానలు తరచుగా ఆఫ్ఘన్ తల్లులను అడ్డుకుంటున్నాయి. తాము ఎన్నడూ అడుగు పెట్టని దేశానికి పంపుతారనే భయంతో శరణార్థులు ప్రతిరోజూ జీవిస్తున్నారు.
తమ శిబిరంలో వైరస్ ఎవరినీ చంపలేదని, అయితే తమ సమాజంలోని రోజువారీ కూలీ కార్మికుల ఆర్థిక పరిస్థితులను మాత్రం తీవ్రంగా దెబ్బతీసిందని ఆఫ్ఘన్ శరణార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ తమ ఆర్థిక వ్యవస్థకు వినాశనం కలిగించిందని శరణార్థి ఒకరు చెప్పారు. ఇప్పుడు మాకు టీకాలు అవసరం లేదు.. ఆర్థికంగా ఆదుకోవడానికి డబ్బు ఇస్తే బాగుంటుందని వారు పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్
బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..