సింగపూర్ : ఇటీవల సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా వార్తలు రాయడం, తోచిన రీతిలో అపనిందలు మోపడం రివాజుగా తయారైంది. తమకు నచ్చనివారిని కించపరిచేలా పోస్టులు ఇటీవల మరీ పెరిగిపోతున్నాయి. అలాంటి క్రమంలో దేశ ప్రధానిపై అసత్య రాతలు రాసినందుకు ఓ బ్లాగర్కు ఆ దేశ హైకోర్టు భారీ జరిమానా విధించింది.
సింగపూర్ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ను అపకీర్తి చేసినందుకు బ్లాగర్ లియోంగ్ సెజ్ హియెన్ సోషల్ మీడియాలో అసత్య వార్తలు రాయడం మొదలెట్టారు. మలేషియాలో జరిగిన మనీలాండరింగ్ కుంభకోణంతో ప్రధానికి సంబంధాలున్నాయని బ్లాగర్ హియన్ ఆరోపించారు. దాంతో ప్రభుత్వం సదరు బ్లాగర్పై చర్యలు తీసుకోవాలంటూ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కేసు విచారించిన సింగపూర్ హైకోర్టు.. ఉద్దేశపూర్వకంగా ప్రధానిపై వ్యాఖ్యలు చేశారని, ప్రధానిని అపకీర్తి చేయడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారని నమ్మిన హైకోర్టు.. సదరు బ్లాగర్ హియెన్కు పది మిలియన్ డాలర్లు (దాదాపు రూ.72 లక్షలు) జరిమానా విధించింది.
అయితే, జరిమానా చెల్లించేందుకు తన వద్ద అంతపెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో సదరు బ్లాగర్.. క్రౌడ్ ఫండింగ్ను ఆశ్రయించాడు. దాంతో దాదాపు రెండు వేల మంది హియెన్కు విరాళంగా నగదు ఇవ్వడానికి ముందుకు రావడంతో జరిమానా చెల్లింపు సమస్య పరిష్కారమైందిగా హియెన్ భావించారు. సోమవారం రాత్రికి చెల్లించాల్సిన జరిమానా కంటే ఎక్కువ నగదు జమైందని బ్లాగర్ లియోంగ్ న్యాయవాది లిమ్ టీన్ చెప్పారు.
కోర్టు నిర్ణయంపై లియోంగ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘ఏ రాజకీయ నాయకుడైనా సామాన్య ప్రజలపై పరువు నష్టం దావా వేయడం ఇదే చివరిసారి అని నమ్ముతున్నాను’ అని హియెన్ చెప్పారు. సింగపూర్ నాయకులు విమర్శకులపై తరచూ కోర్టుల వైపు మొగ్గు చూపుతుంటారు. తమ పలుకుబడిని కాపాడుకోవడానికి ఇలాంటి చర్య అవసరమని వారు నమ్ముతారు.
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..