శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. శ్రీనగర్లో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు కమాండర్ స్థాయి వారే అని పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్స్ జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదుల గురించి సెర్చింగ్ మంగళవారం కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
కశ్మీర్ జోన్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, శ్రీనగర్లోని అలుచి బాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. అలుచి బాగ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు అందిన పకడ్బందీ సమాచారం మేరకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులకు లొంగిపోకుండా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. రెండు వైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
మరణించిన ఉగ్రవాదులను ఇంకా నిర్ధారించలేదు. వారు ఏ తీవ్రవాద గ్రూపునకు చెందినవారో కూడా తెలియరాలేదు. అయితే, వీరిద్దరూ కమాండర్ స్థాయి వారేనని పోలీసులు చెప్తున్నారు. ఇలాఉండగా, హతమైన ఈ ఇద్దరు ఉగ్రవాద కమాండర్ల పేర్లు ఇటీవల జమ్ముకశ్మీర్ పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాయి.
తాలిబాన్, ఆఫ్ఘాన్ సైన్యం మధ్య భీకర పోరు..?
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
వాతావరణ ప్రభావంతో నష్టపోనున్న చిన్నారులు
నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే: వెంకయ్యనాయుడు
దేశంలోనే తొలి స్మోగ్ టవర్ ఏర్పాటు.. ఇది ఎందుకో తెలుసా..?
హాల్మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..