Loksabha Elections 2024 : ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సానుకూల సంకేతమని, కానీ బీజేపీని కేవలం ఇద్దరు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల కనుసన్నల్లో నడుస్తున్న కాషాయ పార్టీలో వివాదాలను, విభేదాలను వారు అనుమతించరని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు అవసరమని కానీ బీజేపీలో వాటికి తావులేదని అన్నారు.
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నిలువరించే కాషాయ పాలకులు నియంతృత్వం గురించి మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే నేత అనేది బీజేపీ నినాదమని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, నియంతృత్వమని ఉదిత్ రాజ్ పేర్కొన్నారు.
బీజేపీ మేనిఫెస్టోలో ప్రజలకు ప్రయోజనం కలిగించే ఎలాంటి అంశాలు లేవని, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన అనంతరం దేశంలో భారీ మార్పు దిశగా అడుగులు పడతాయనే ఆకాంక్షలు వెలుగుచూశాయని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో బీజేపీ నేతల్లో భయం మొదలైందని, అందుకే తమ పార్టీ మేనిఫెస్టోపై కాషాయ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆరోపించారు.
Read More :