Lok Sabha Elections : బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ అధికారి వెల్లడించారు.
‘బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశాం. ఈ నెల 25న జయనగర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 123 (3) కింద కేసు బుక్కయ్యింది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి కేసు బుక్ చేశాం’ అని కర్ణాటక చీఫ్ ఎలక్షన్ అధికారి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
Case is booked against Tejasvi Surya MP and Candidate of Bengaluru South PC on 25.04.24 at Jayanagar PS u/s 123(3) for posting a video in X handle and soliciting votes on the ground of religion.
— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) April 26, 2024