కాబూల్ : (Taliban Vs Panjshir) ఆఫ్ఘనిస్తాన్లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర పోరు ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 50 మంది తాలిబాన్లు మరణించారు. 20 మందికి పైగా తాలిబాన్లను బందీలుగా పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వశం కాకుండా ఉన్న ఏకైక ప్రాంతమైన పంజ్షీర్లో పోరాటం ప్రమాదకరమైన మలుపు వైపు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్షీర్ లోయ ఒకటి. ఆంధ్రాబ్ ప్రావిన్స్లో జరిగిన పోరులో 50 మందికి పైగా తాలిబాన్ యోధులు మరణించారని, 20 మందికి పైగా యోధులను బందీలుగా చేసుకున్నట్లు పంజ్షీర్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పోరాటంలో తాలిబాన్ ప్రాంతీయ కమాండర్ కూడా మరణించినట్లు కూడా తెలిపాయి. ఈ యుద్ధంలో పంజ్షీర్కు మద్దతు ఇస్తున్న ఒక ఫైటర్ మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. తాలిబాన్ వర్గాలు దీనిని ధ్రువీకరించలేదు.
పంజ్షీర్ లోయలో తిరుగుబాటుదారులకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆఫ్ఘన్ సైన్యం కూడా వారితో పాలుపంచుకుంటున్నది. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్.. నార్తర్న్ అలయన్స్కు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్.. యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదేసమయంలో, చర్చలు జరిగితే అందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం అత్యవసర జీ7 సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. ఆగస్టు 31 తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని తరలించకుండా చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కోరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రజలను తరలించడానికి మరింత ఎక్కువ సమయం పట్టనున్నది. వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు, విదేశీయులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయేందుకు కాబూల్ విమానాశ్రయంలో విమానాల కోసం ఎదురు చూస్తున్నారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
వాతావరణ ప్రభావంతో నష్టపోనున్న చిన్నారులు
నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే: వెంకయ్యనాయుడు
దేశంలోనే తొలి స్మోగ్ టవర్ ఏర్పాటు.. ఇది ఎందుకో తెలుసా..?
హాల్మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..