నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన 24 ఏళ్ల మహిళను బలవంతంగా మతమార్పిడి(Religious Conversion) చేశారు. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. రేప్, బ్లాక్మెయిల్, బెదిరింపులు, బలవంత మతమార్పిడి కింద కేసు బుక్ చేశారు. మతమార్పిడి చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వదిలేయ్ అని ఆ మహిళ అరుస్తున్నా.. ఓ వ్యక్తి ఇస్లామిక్ మంత్రాలు చదువుతూ ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కేసులో అయ్యాజ్ తాజ్ మాదరే, అమీన్ షేక్లను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఉన్న హజ్రత్ మౌలానా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అయ్యాజ్ తాజ్ మాదరే, బాధిత మహిళ గతంలో ఒకే స్కూల్లో చదువుకున్నారు. అయితే ఓ ప్రాపర్టీ వివాదం నేపథ్యంలో ఆ ఇద్దరు కలుసుకున్నారు. 2025 ఫిబ్రవరిలో ఓ హోటల్లో ఆ మీటింగ్ జరిగింది. అప్పుడు ఏదో మత్తు పదార్ధాన్ని తనకు ఇచ్చినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను తీసి.. ఆమెను బెదిరించడం ప్రారంభించారు. బాధిత మహిళ భర్త భారతీయ వైమానిక దళంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతను నాగపూర్ అవతల పోస్టింగ్లో ఉన్నాడు. ఒకవేళ తాను చెప్పినట్లే వినకుంటే, ఆ ఫోటోలు, వీడియోలను భర్తకు చేరవేస్తామని ఆమెను బెదిరించారు.
గడిచిన కొన్ని రోజుల నుంచి బాధిత మహిళను బెదిరించి ఆమె నుంచి సుమారు 4 లక్షల దోచుకున్నారు. ఏదో ద్రవ పదార్థాన్ని తాగించేవారు అని, క్షుద్ర పద్ధతిలో కొన్ని పూజలు చేసేవారని, ఆ తర్వాత లైంగికంగా దాడి చేసేవారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. సోనేగావ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయినట్లు డీఎస్పీ రుషికేశ్ రెడ్డి తెలిపారు. మే 31వ తేదీన తనను కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లారని, అక్కడ మతమార్పిడి పూజను చేశారని ఆమె పేర్కొన్నది. తన ఇష్టం లేకుండానే మతమార్పిడి చేయించి, ప్రధాని నిందితుడితో పెళ్లి జరిగినట్లు చెప్పారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది.