న్యూఢిల్లీ : బంగారు ఆభరణాలకు హాల్మార్క్ వేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంగారు దుకాణాలు (Hallmark Strike) మూతపడ్డాయి. సింబాలిక్ స్ట్రైక్లో భాగంగా ఇవాళ ఒకరోజు దుకాణాలను మూసిఉంచారు. ఆలిండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ఆధ్వర్యంలో బంగారు దుకాణాలు ఈ బంద్ను పాటిస్తున్నాయి. రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు చెందిన నాలుగు జోన్లలోని 350 సంఘాలు, సమాఖ్యలు వీరికి మద్దతు తెలిపాయి. జీజేసీ పిలుపు మేరకు తెలంగాణలోని దాదాపు 55,000 జెమ్, గోల్డ్ జ్యువెలరీ ట్రేడర్స్ తమ వ్యాపారాలను నిలిపివేశారు.
నకిలీ బంగారు ఆభరణాల అమ్మకాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 16 న హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, తక్షణమే హాల్ మార్కింగ్ యూనిక్ ఐడీ (హెచ్యూఐడీ) ని విరమించుకోవాలని జీజేసీ డిమాండ్ చేస్తున్నది. కొత్త హెచ్యూఐడీ విధానం అసాధ్యమైనదని, అమలు చేయడం చాలా కష్టమని హైదరాబాద్కు చెందిన టాస్క్ఫోర్స్ సభ్యుడు తెలిపారు. హాల్ మార్కింగ్ కేంద్రాల్లో ఆరంకెల హెచ్యూఐడీ తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నందున.. వ్యాపారం పూర్తిగా మందగించిపోయిందని ఆయన వాపోయాడు. ఒకరోజు సింబాలిక్ స్ట్రైక్ను విజయవంతం చేసేందుకు టాస్క్ఫోర్స్ సభ్యులు అన్ని దుకాణాల యజమానులతో మాట్లాడారని క్యాప్స్గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాస్ రావు చెప్పారు.
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
ల్యాబ్లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..