శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో రాళ్ల దాడిని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నది. కశ్మీర్లో భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం సర్వసాధారణంగా మారింది. ఇకపై భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతూ (Stone pelting) పట్టుబడిన వారికి పాస్పోర్ట్ అందుబాటులో ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయలేరు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, భద్రతా దళాలపై రాళ్లు విసురుతూ పట్టుబడిన వారికి పాస్పోర్ట్ అందుబాటులో ఉండదు. అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేరు. కశ్మీర్ సీఐడీ స్పెషల్ బ్రాంచ్ అన్ని భద్రతా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. రాళ్ల దాడి ఆరోపణల విషయంలో డిజిటల్ ఆధారాలు, పోలీసు రికార్డులను పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సీఐడీ క్లియరెన్స్ నివేదిక తప్పనిసరి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి కుటుంబ సభ్యుడు, నిర్దిష్ట బంధువు ఒక రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉంటే అతడి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జమాతే-ఈ-ఇస్లామీ వంటి ఏదైనా విదేశీ నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న సమాచారం కూడా సేకరిస్తారు.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును 2019 ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అనంతరం కశ్మీర్లో రాళ్ల దాడి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. 2019 లో 1999 రాళ్ల దాడులు, 2020 లో ఇది 255 కు చేరింది. 2021 లో మే 2 న పుల్వామాలోని దగర్పోరాలో జరిగిన ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులను రక్షించడానికి ప్రజలు రాళ్లు రువ్వారు. దీని తర్వాత మాస్కులు ధరించిన వ్యక్తులు మే 12 న బార్పోరాలో రాళ్లు రువ్వారు. ఇవి కాకుండా పెద్ద సంఘటనలేవి నమోదు కాలేదు. 2018 లో 1,458, 2017 లో 1,412 రాళ్లు రువ్విన సంఘటనలు నమోదయ్యాయి.
సరిహద్దు కమాండ్గా తొలిసారి మహిళా ఐపీఎస్
కేపీఎల్ ఆడావో.. ఇండియా రానివ్వమన్నారు: హెర్షలీ గిబ్స్
మృత్యువు నుంచి బయటపడటం అంటే ఇదే..!
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్ పరిశోధన
టోక్యో ఒలింపిక్స్లో రాణులదే హవా..!
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..