టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ ఇప్పుడిప్పుడే తారాస్థాయికి చేరుకున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో పోటీలు జరుగుతుండటంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఒలింపిక్స్లో పురుషులు, మహిళలకు సమాన సంఖ్యలో క్రీడాంశాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్లో పురుషుల కంటే మహిళా క్రీడాకారులే (Women Power) ఎక్కువ పతకాలు సాధించి ముందు వరుసలో ఉన్నారు. టాప్-5 దేశాల మహిళలు.. పురుషుల కంటే 67 శాతం ఎక్కువ పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఐదు దేశాలకు చెందిన మహిళలు ఇప్పటివరకు 194 పతకాలు సాధించగా.. పురుషులు కేవలం 116 మాత్రమే అందుకున్నారు.
పతకాల పట్టికలో (శనివారం వరకు ) ఒకటో స్థానంలో ఉన్న చైనా దేశానికి చెందిన మహిళలు.. పురుషుల కన్నా రెండు రెట్లు ఎక్కువగా పతకాలు సాధించారు. అమెరికన్ మహిళలు ఆ దేశ పురుషుల కంటే మూడు రెట్లు గెలిచి రాణులదే హవా అని నిరూపిస్తున్నారు. ఇదే ట్రెండ్ జపాన్, రష్యా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఉన్నది. భారతదేశానికి ఇప్పటివరకు ఒకే ఒక్క పతకం అందింది. ఈ పతకం కూడా మహిళ ద్వారా అందిందే కావడం విశేషం. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్లో 35 మహిళలు రెండు అంతకన్నా ఎక్కువ మెడల్స్ సాధించగా.. పురుషులు కేవలం 19 మందే రెండు కన్నా పతకాలు అందుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా నాలుగు పతకాలు సాధించి ముందు వరుసలో ఉన్నది. చైనా, జపాన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా దేశాల నుంచి మొత్తం 2450 మంది అథ్లెట్లు పాల్గొనగా, వీరిలో నుంచి 1354 మంది మహిళలు, 1096 మంది పురుషులు ఉన్నారు.
ఒలింపిక్స్లో గుర్రపుస్వారీ పోటీ ఓపెన్ క్యాటగిరీలో ఉంటుంది. ఇందులో పురుషులు, మహిళలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఓపెన్ క్యాటగిరీలో ఇప్పటివరకు మొత్తం 12 పతకాల ఈవెంట్లు జరిగాయి. ఇందులో 10 పతకాలను మహిళలు గెలుచుకోగా, పురుషులు 2 పతకాలకే పరిమితమయ్యారు.
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..